Tuesday, April 23, 2024

బాలయ్య సరసన ఇద్దరు బామ్మలు ?

క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు గోపీచంద్ మలినేని. అంతేకాకుండా మొన్నటి వరకు వేరే వారి కథలను తీసుకొని డైరెక్ట్ చేసిన గోపిచంద్… ఇప్పుడు సొంతంగా కథలను తయారు చేసుకుంటున్నారట. బాలయ్య కోసం కూడా అదే పని చేశాడట గోపీచంద్. సమాజంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథను సొంతంగా తయారు చేసుకొని బాలకృష్ణకు వినిపించాడట.

అందుకే ఆ మధ్య వేటపాలెం లైబ్రరీ కి వెళ్లి మెటీరియల్ ను సేకరించాడని సమాచారం. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ సరసన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నారట. అంతే కాదు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని కూడా తెలుస్తోంది. అఖండ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలకృష్ణ ఈ సినిమానే చేయబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలకృష్ణ నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో నిర్మాతలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement