Thursday, April 25, 2024

కరోనా తో అసురన్ నటుడు మృతి

కరోనా మహమ్మారి కారణంగా సామాన్య ప్రజలతో పాటు సినీరాజకీయ ప్రముఖులు కూడా ప్రాణాలు విడుస్తున్నారు. బాలీవుడ్ ,టాలీవుడ్ ,కోలీవుడ్ అనే తేడా లేకుండా చాలామంది ఈ మహమ్మారికి బలైపోతున్నారు. తాజాగా అసురన్ సినిమాలో నటించిన నితీష్ వీర కరోనాతో మరణించారు. నితీష్ వీర వయసు 45 సంవత్సరాలు. సెల్వరాఘవన్ తీసిన పుదుపెట్టై సినిమాతో ఎంట్రీ ఇచ్చారు నితీష్ వీర.

ఇక నితీష్ మరణంతో సెల్వరాఘవన్ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. నా మని ఆత్మకు శాంతి చేకూరాలి అనిఆ నాటి పాత్రను గుర్తు చేసుకున్నారు. నటి అభిరామి స్పందిస్తూ…. అన్న మరణం తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. అద్భుతమైన నటుడు. ఇది ఎప్పుడు ఊహించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు మరికొంత మంది స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement