Friday, April 26, 2024

సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఊరట..

కరోనా సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు ప్రకటించింది. ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు రుణాలకు 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2020 ఏప్రిల్, మే, జూన్ మాసాల విద్యుత్ స్థిర చార్జీల చెల్లింపులపై వెసులుబాటు కల్పించింది. థియేటర్లు, మల్టీప్లెక్సులు ఈ మూడు మాసాల విద్యుత్ చార్జీలు వాయిదా వేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ బకాయిలను జులై నుంచి డిసెంబరు మధ్యలో ఎప్పుడైనా చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement