Friday, April 19, 2024

అనుష్క డిజిటల్ ఎంట్రీకి రెడి ?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆదరగొడుతుంది. ఇటీవల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క.. నాలుగు పదుల వయసులోనూ అదే గ్లామర్ తో దూసుకుపోతోంది. అయితే అనుష్క ప్రస్తుతానికి ఏ ఒక్క కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, త్రిష, నయనతార వంటి స్టార్ హీరోయిన్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన దూసుకుపోతున్నారు. ఇప్పుడు అనుష్క కూడా అదే దారిలో వెళ్లేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ఓటిటి సంస్థ నుంచి అనుష్కకు భారీ ఆఫర్ కూడా వచ్చినట్లు సమాచారం. మరి ఆ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో ఆమెకే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement