Saturday, April 20, 2024

అనుభ‌వించు రాజా టీజ‌ర్ విడుద‌ల చేసిన రామ్ చ‌ర‌ణ్‌..

రాజ్ త‌రుణ్ హీరోగా శ్రీను గ‌వి రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ‘అనుభవించు రాజా’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కషీప్‌ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తాజాగా రామ్ చరణ్ చేతుల మీదుగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో కోడి పందాలు ఆడే వ్య‌క్తిగా రాజ్ త‌రుణ్ క‌నిపిస్తున్నాడు. జాతర కోలాహలం మధ్య, కోడితో కలిసి పందేనికి సిద్ధమవుతున్నట్టుగా రాజ్ త‌రుణ్ క‌నిపిస్తున్నాడు. టీజ‌ర్ చూస్తుంటే టీజ‌ర్ కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ‘బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకోకడు గెలవడం కష్టమే’అంటూ రాజ్‌ తరుణ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్‌ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్‌ వంశీ, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్‌ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

YouTube video

ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. నేటి బంగారం ధర ఇది!

Advertisement

తాజా వార్తలు

Advertisement