Friday, March 29, 2024

శాకుంతలం సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది ?

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోషన్ నటిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సమంత ప్రీ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఆ కథ ప్రకారం శకుంతలకు ప్రియంవద అనే ఇష్టసఖి ఉంటుంది.

కాగా ఆ పాత్ర కోసం మొదట ఈషా రెబ్బా ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి ఆమె స్థానంలో తమిళ నటి అదితి బాలన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె షూటింగ్ లో కూడా పాల్గొందట. కాగా ఈ సినిమాకి గుణశేఖర్ సతీమణి నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరో వైపు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement