Friday, March 29, 2024

ఎయిర్ హోస్టర్.. గా రంగమ్మత్త

జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది అనసూయ. తన అందంతో అభినయంతో ఉర్రూతలూగించిన ఈ అమ్మడు వెండి తెరపై కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం థాంక్యూ బ్రదర్ వంటి చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా అనసూయ డిఫరెంట్ జోనర్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పేపర్ బాయ్, విటమిన్-సి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇది ఒక ఆంథాలజీ సినిమా. ఇది ఆరు కథల సమ్మేళనం అని ప్రతి కథలో ఒక లీడ్ రొల్ ఉంటారని… ఇలా అనసూయ కూడా ఒక లీడ్ రొలె చేస్తోందని సమాచారం. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement