Friday, March 29, 2024

ఎవ్వరూ ఊహించని అప్డేట్ మే 31న రాబోతుందట !!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయినా ఆ తర్వాత జనాల పై బాగానే ప్రభావాన్ని చూపించాయి.

ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజునాడు ఎవరు ఊహించని ఓ పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఆ అప్డేట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement