Wednesday, April 17, 2024

త‌మిళ చిత్రంలో హీరోయిన్ గా సాయిప‌ల్ల‌వి సిస్ట‌ర్..

సినిమాల్లో సిస్ట‌ర్స్ రావ‌డం ప‌రిపాటే. అలాగే ఇప్పుడు హీరోయిన్ సాయిప‌ల్ల‌వి కూడా సినిమాలోకి ఎంట్రీ ఇస్తోంది. పూజ క‌న్న‌న్ హీరోయిన్ గా త‌మిళ చిత్రంలో న‌టిస్తోంది. యాక్షన్ కొరియోగ్రఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ‘సిల్వా’ .. దర్శకుడిగా ‘చితిరై సెవ్వానం’ అనే సినిమాను రూపొందించాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ ఈ కథ నడుస్తుంది. తండ్రి పాత్రలో సముద్రఖని .. కూతురు పాత్రలో పూజ కన్నన్ కనిపించనున్నారు. అమృత స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. జీ 5 తమిళంలో ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement