Monday, April 15, 2024

మహేష్ తో పాటు కీర్తి కూడా – సర్కారు వారి పాట అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ మంగళవారం ప్రారంభించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది.

ఈ కొత్త షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పాల్గొంటుందట. గతంలో దుబాయ్ షెడ్యూల్ లో కూడా కీర్తి సురేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కొత్త షెడ్యూల్ లో ఇద్దరు పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. కాగా ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతం ఇస్తుండగా మైత్రీ మూవీ మేకర్ ,14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement