Thursday, March 28, 2024

కేబుల్ బ్రిడ్జ్ పై అల్లుఅర్జున్ ఫ్యామిలీ!!

తెలంగాణలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. మొత్తం అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అయితే నిన్న సాయంత్రం వర్షాలు కాస్త తగ్గడంతో రోడ్లపైకి జనాలు రావడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీ తో బయటకు వచ్చి ఎంజాయ్ చేశారు. ఆ వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లుస్నేహ.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ భార్య స్నేహ ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి కారులో వెళుతుండగా వీడియో తీశారు స్నేహ. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/reel/CRoA3_pjupM/?utm_medium=copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement