Tuesday, April 23, 2024

వ్యాక్సిన్ తో సేఫ్ అయ్యా: అల్లు అరవింద్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా పాజిటివ్ అని వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అల్లు అరవింద్ స్పందించారు. తాను ఇటీవలే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నట్లు తెలిపారు. తనతో పాటు ముగ్గురు స్నేహితులం వ్యాక్సిన్ తీసుకున్నాక ఊరెళ్లిన్నట్లు తెలిపారు. తిరుగొచ్చాక నాకు మరో వ్యక్తి జ్వరం వచ్చిందని అన్నారు. మరో మిత్రుడు ఆస్పత్రిపాలయ్యాడని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న నేను, మరో వ్యక్తి తేలికపాటి జ్వరానికి గురయ్యాం. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి మాత్రం ఆసుపత్రిలో చేరాడు. దీన్ని బట్టి నేను చెప్పేదేంటంటే… వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల ప్రాణహాని ఉండదు. కరోనా ప్రభావం కూడా మనిషి శరీరంపై ఏమంత ఎక్కువగా ఉండదు. వైరస్ వచ్చి పోతుందంతే. వ్యాక్సిన్ వేయించుకోబట్టే నాకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరంలేకపోయింది. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి. అప్పుడు కరోనా వచ్చినా ఏమీ చేయదు” అని వివరించారు. ఈ మేరకు అల్లు అరవింద్ ఓ వీడియో విడుదల చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement