Tuesday, April 23, 2024

తమిళనాడు లో అఖండ

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని విల్లుపురం కి చెందిన వెంకటరమణ దేవాలయంలో జరుగుతుంది..

ఈ మూవీ కి సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ ను ఇక్కడే బోయపాటి తెరకెక్కిస్తున్నాడట. జూలై 21 నుంచి ఆగస్టు 5 వరకు అక్కడే షూటింగ్ జరుపుకునే విధంగా యూనిట్ అనుమతులు తీసుకుందని తెలుస్తోంది. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement