Saturday, April 20, 2024

మహేష్‌బాబు విడుదల చేసిన‘మేజర్’ గ్లింప్స్

వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ వరుస హిట్లు కొడుతున్న అడివిశేష్ హీరోగా నటించిన ‘మేజర్’ గ్లింప్స్‌ను ప్రిన్స్ మహేష్‌బాబు సోమవారం సాయంత్రం విడుదల చేశాడు. 26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. సూపర్‌స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టటైన్‌మెంట్ బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈనెల 28న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement