Friday, March 29, 2024

ద‌హ‌నం మూవీ గొప్ప‌గా తీశారు..

ఆదిత్య ఓం హీరోగా డా.శ్రీపెతకంశెట్టి సతీష్‌కు మార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘దహనం’. అడారి మూర్తిసా యి దర్శకుడు. 31న విడుద లవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. అతిథిగా పాల్గొన్న వైవీయస్‌. చౌదరి మాట్లాడుతూ ఆదిత్య ఓం పోస్టర్‌ చూస్తుంటే కళ్లు, కంటిబొమ్మల్లోనూ సంఘర్షణ చూపించారు. ట్రైలర్‌ బావుంది అన్నారు. ఆదిత్య ఓం మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సినిమాలు వస్తాయి. కానీ దహనం వంటి సినిమా ఏ ఐదేళ్లకో, పదేళ్లకో మాత్రమే వస్తాయి. ఈ సినిమాను అంతగొప్పగా తీశారు మా దర్శక, నిర్మాతలు అని అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ వర్తమాన, భూత భవిష్యత్‌ కాలాల్లో నీరు నిప్పు గాలితో అవసరం ఉంటుందని చెప్పే కథ ఇది అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ నాకు చిన్నతనం నుంచి సంగీతం అంటే ఇష్టం. తొలుత రచయితగా వచ్చాను చివరగా నిర్మాతగా మారాను అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర ప్రసాద్‌, ప్రసన్నకుమార్‌, పంపిణీదారు ఆదినారాయణ, మాదాల రవి, అనిల్‌ కుర్మాచలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement