Saturday, April 20, 2024

ప్రభాస్ లేకుండా ఆదిపురుష్ ?

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించబోతున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపించబోతోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ ముంబైలో జరగదా కరోనా కారణంగా మిగిలిన షూటింగ్ వాయిదా పడింది.

వెంటనే షూటింగ్ ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు దర్శకనిర్మాతలు. కానీ హైదరాబాదులో కూడా లాక్ డౌన్ పడటంతో ముంబైలోనే కరోనా తగ్గిన తరువాత ప్రారంభిస్తామని డైరెక్టర్ ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ షూట్ అంతా కూడా ప్రభాస్ లేకుండానే జరుగుతుందట.

ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్ సినిమా షూటింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండూ పూర్తయిన తర్వాత ఆదిపురుష్ సెట్ జాయిన్ కాబోతున్నాడట. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement