Tuesday, April 23, 2024

ముంబై టు హైదరాబాద్…. వయా ఆదిపురుష్ !!

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. సీతగా కృతి సనన్ కనిపించబోతోంది. అలాగే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతమేర కంప్లీట్ అయింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

నిజానికి ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ ను చేంజ్ చేశారట దర్శక ,నిర్మాతలు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ కు ఈ షూటింగ్ ను షిఫ్ట్ చేయబోతున్నారట. మహారాష్ట్రలో పరిస్థితులు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించట్లేదు. దీంతో హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. మొత్తం యూనిట్ అంతా కూడా మూడు నెలల పాటు హైదరాబాదులోనే ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు సలార్, రాధేశ్యామ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement