Wednesday, April 24, 2024

ఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ ‘కిరాతక’

ప్రేమ కావలి సినిమా తో హీరోగా పరిచయం అయ్యారు ఆది సాయి కుమార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత అనుకున్న స్థాయిలో హిట్ సాధించలేకపోయారు ఆది. అయితే ప్రస్తుతం వీరభద్రం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఆది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు తాజాగా టైటిల్ ని ఫిక్స్ చేశారు. కిరాతక అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇక ఇటీవల ఆది సాయికుమార్ శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అటు దర్శకుడు వీరభద్రం అలాగే ఆది సాయి కుమార్ లు ఇద్దరు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement