Saturday, April 20, 2024

రామ్ కి విలన్ గా అందుకే ఒప్పుకున్నా…ఆది పినిశెట్టి

లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించబోతున్నారు. అయితే తను విలన్ గా ఓకే చెప్పడానికి ఇదే కారణమంటూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు ఆది. డైరెక్టర్ లింగుస్వామి వినిపించిన కథ విన్నాక స్క్రిప్ట్ చదివాక వారం సమయం తీసుకున్నానని సరైనోడు తర్వాత అందులోని పాత్రలు చేయాలంటే… ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నానని, అయితే ఇది నార్మల్ రోల్ కాదని చెప్పుకొచ్చారు.

మామూలుగా అయితే విలన్ పాత్రకు డిటైలింగ్ ఉండదని… కానీ ఇందులో అది ఉందని చెప్పుకొచ్చారు. కర్నూలు కడప కి చెందిన ఓ పవర్ఫుల్ రోల్ అని చెప్పుకొచ్చారు. సరైనోడు లో స్టైలిష్ విలన్ గా చేసిన తర్వాత ఇందులో మళ్ళీ విలన్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని అందుకే ఈ సినిమాను ఓకే చేసినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement