Thursday, March 28, 2024

ఎన్టీఆర్ షోకు మరో స్పెషల్ గెస్ట్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షో సక్సెస్ పుల్ గా సాగుతోంది. హోస్ట్ గా తన మార్క్ చూపిస్తున్నాడు తారక్. ఈ షోకు టీఆర్పీని పెంచడానికి నిర్వహకులు సెలెబ్రిటీలను సైతం ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, మహేష్ బాబు, సమంత లాంటి స్టార్స్ హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ దసరా సందర్భంగా ప్రసారం చేయనున్నారు. అలాగే ఈ నెలాఖరులోగా సమంత ఎపిసోడ్ ను ప్రసారం చేస్తారని తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ షోకు మరో స్పెషల్ గెస్ట్ గా రాబోతోంది. ఆమె మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ షో కోసం తమన్నా ఎపిసోడ్ షూట్ వచ్చే వారంలో జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. కాగా, ఎన్టీఆర్ తో తమన్నా ఉసరవెల్లి మూవీలో నటించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఆగని పెట్రో మోత.. నేటి రేట్లు ఇవీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement