Thursday, April 25, 2024

ఫోటోలు.. వీడియోల‌తో చిక్కుల్లో ప‌డిన న‌టి ర‌వీనాటాండ‌న్

ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు..వీడియోల‌తో చిక్కుల్లో ప‌డింది బాలీవుడ్ న‌టి ర‌వీనాటాండ‌న్. వివ‌రాలు చూస్తే. మధ్యప్రదేశ్‌ లోని టైగర్‌ సఫారీలో రవీనా టాండన్‌ పెద్దపులికి అతిసమీపంగా వెళ్లి ఫోటోలు తీయడంపై వివాదం రాజుకుంది. సాత్పురా టైగర్‌ రిజర్వ్‌ సఫారీ టూర్‌లో ఆమె ప్రయాణిస్తున్న వాహనం పులి దగ్గరికి వెళ్లడంపై అక్కడి ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఫారెస్ట్‌ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేయబోతున్నారు.

నవంబర్ 22న మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో ఉన్న సత్పురా టైగర్ రిజర్వ్ ను సందర్శించిన రవీనా టాండన్.. పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రవీనా వాహనం పులికి దగ్గరగా వెళ్లిన సమయంలో అది గాండ్రించడం కూడా వీడియోలో చూడొచ్చు. అందులో రవీనా టాండన్ కు చేరువలోనే పులి ఉన్న ఓ వీడియో ఉండడంతో అధికారులు స్పందించారు.రవీనా షేర్‌ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ (ఎస్‌డీవో) ఆఫ్‌ ఫారెస్ట్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement