Monday, March 25, 2024

ఆ సీన్ చూసి అందరికీ దిమ్మతిరిగిపోయింది…యంగ్ టైగర్ పై సమీర్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో హీరోలు, ఆర్టిస్టుల మధ్య స్నేహ సంబంధాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమీర్, రాజీవ్ కనకాల వారి స్నేహం గురించి కొత్తగా చెప్పనవసరం. కాగా తాజాగా తన స్నేహితుడు ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సమీర్. జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందేనని అందుకు… ఉదాహరణ రాఖీ సినిమాలో ఇండియన్ రైల్వేస్ గురించి మాట్లాడే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో ఇండియన్ రైల్వేస్ రోజుకు ఎన్ని రైళ్ళు వెళుతున్నాయి, ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య, అందులో పనిచేసే కార్మికుల సంఖ్య చెప్పాలి. అలాంటి ఓ సీన్ గుక్కతిప్పుకోకుండా ఒక్కటే టేక్ ఎన్టీఆర్ చెప్పేసాడని సమీర్ అన్నారు.

ఆ సీన్ చూసి ప్రతి ఒక్కరికి దిమ్మతిరిగిపోయిందని ఆ సన్నివేశం అయిపోయాక కోట శ్రీనివాసరావు పిలిచి సీనియర్ ఎన్టీఆర్ నీలో పునర్జన్మించాడు రా అని ఆశీర్వదించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఏ పాత్రకైనా 100% న్యాయం చేస్తానని చెప్పాడు సమీర్. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ ఆర్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement