Thursday, April 25, 2024

వచ్చే ఏడాదికే ఆచార్య ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా నటిస్తున్నారు. ఇక చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా…రాంచరణ్ పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే మే లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే విషయమై ఫ్రాన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాకి రిలీజ్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏంటంటే… ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement