Thursday, April 25, 2024

ఆచార్య సినిమా సందడి ఈపాటికే స్టార్ట్ అయ్యి ఉండేది

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తుండగా పూజాహెగ్డే రామ్ చరణ్ సరసన నటిస్తోంది. అయితే నిజానికి మే 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా కుదరలేదు.

ఒకవేళ అన్నీ పరిస్థితులు బాగా ఉండుంటే ఈ పాటికి థియేటర్స్ లో సందడికి షురూ అయ్యేది. ఇక మెగా స్టార్ ఫ్యాన్స్ హంగామా కూడా వేరే లెవెల్ లో ఉండేది. కానీ అది కుదరకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. కాగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా… మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలసి సంయుక్తంగా రాంచరణ్ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement