Friday, April 19, 2024

సిద్దార్థ్ చనిపోయాడు…!!అది జరిగి మూడేళ్లు

హీరో సిద్ధార్థ్ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఒకానొక సమయంలో సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ఇటీవల ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం మహాసముద్రం సినిమా చేస్తున్నాడు సిద్దార్థ్. ఇదిలా ఉండగా సిద్ధార్థ్ తాజాగా ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఏముందంటే యుక్త వయసులో చనిపోయిన 10 మంది దక్షిణాది ప్రముఖ తారలు అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసింది.

అయితే దానికి సౌందర్య, ఆర్తి అగర్వాల్ , మధ్యలో సిద్దార్థ్ ఫోటోలు పెట్టారు. అయితే అది చూసిన సిద్దార్థ్ షాక్ కు గురయ్యారట. వెంటనే యూట్యూబ్ ఛానల్ వారికి ఫిర్యాదు కూడా చేశాడట. కానీ వారు మాత్రం ఆ వీడియోలో ఏం తప్పు లేదు కదా అన్నారట. నిజంగా ఆ వీడియోలో సిద్దార్థ్ మరణం గురించి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ… ఫోటోలు పెట్టారు. దీంతో సిద్ధార్థ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. విశేషమేంటంటే ఆ వీడియో పోస్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయింది.

https://twitter.com/Actor_Siddharth/status/1416662999629131778?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement