Friday, April 19, 2024

సోనూసూద్ కోసం….సైకిల్ యాత్ర

కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోను సూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతుగా సహాయం చేశాడు. అయితే ఆ సమయంలో సోను సూద్ చేసిన సహాయానికి ఎంతోమంది సోను సూద్ పై అభిమానాన్ని పెంచుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు పాదయాత్రలు కూడా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక మొన్ననే ఓ వ్యక్తి పాదయాత్ర చేసుకుని సోనూసూద్ ని కలవగా…. ఇప్పుడు మరో అభిమాని సైకిల్ యాత్ర చేపట్టాడు.

సోనూసూద్ ని కలిసి ఫోటో దిగాలనే కోరికతో 800 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టాడు ఓ యువకుడు. నాగర్ కర్నూల్ కు చెందిన సురేష్ అనే యువకుడు సోనూసూద్ ను కలిసేందుకు నడుంబిగించాడు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చేరుకున్నాడు. తలపై హెల్మెట్ పెట్టుకుని రోజుకి 60 నుంచి 70 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తున్నాడు సురేష్. కాగా సోను సూద్ అభిమానులు విషయం తెలుసుకొని మార్గమధ్యంలో ఆహారాన్ని తనకు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు సురేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement