Friday, April 19, 2024

విరాటపర్వం సినిమాకు వరుస ఆఫర్స్

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. కరోనా కేసులు తగ్గితే జూలైలో ఈ సినిమా రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రియమణి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. నందితాదాస్, జరీనా వహాబ్, ఈశ్వరరావు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నప్పటికీ ఈ సినిమాకు ఓటీటీ నుంచి లకు వరుస ఆఫర్లు వస్తున్నాయట. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. అలాగే సాయి పల్లవి జానపద గాయనిగా మరి కొన్ని సన్నివేశాలలో నక్సలైట్ గా కనిపించనుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement