Friday, April 19, 2024

పెళ్లి చేసుకున్నందుకు…బాలీవుడ్ నటిపై పోలీస్ కేసు

బాలీవుడ్ లేడీ కమెడియన్ సుగంధ మిశ్రా కమెడియన్ సాకేత్ లు ఏప్రిల్ చివరి వారంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాగా ఆ పెళ్లికి సంబంధించి జరిగిన హంగామా అభిమానులకు తెలియాలని ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు తంటా ఇక్కడే మొదలైంది. కరోనా సమయంలో నియమాలు గాలికి వదిలి పెళ్లి చేసుకున్నారు అంటూ కొందరు మండిపడుతున్నారు. మరికొంతమంది కేసులు కూడా పెడుతున్నారు. పెళ్లి కొడుకు కోసం పంజాబ్ లోని ఫగ్వారా రిసార్ట్ లో ఏర్పాటుచేసిన విడిది లో భారీ స్థాయిలో బంధుమిత్రులు గుమిగూడారు. ఇది కరోనా నిబంధనలు అతిక్రమించటమేనని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో స్థానిక పోలీసులు ఐపిసి సెక్షన్ 188 కింద కేసు బుక్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement