Monday, April 15, 2024

విలేజ్ గర్ల్ గా పూజా…లుక్ వైరల్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే చిరంజీవి సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన లుక్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా పూజా హెగ్డే కు సంబంధించి తన పాత్రకు సంబంధించి ఎలాంటి లుక్ ను రిలీజ్ చేయలేదు.

అయితే నిన్న కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా సినీ స్టార్స్ అంతా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చారు. అలాగే పూజా హెగ్డే కూడా కొరటాలతో దిగిన ఫోటో ని పోస్ట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కొరటాలకు ఫొటోస్ దిగడం అంటే ఇష్టం ఉండదని… తన బలవంతం మీదనే ఫొటోస్ దిగాడని చెప్పుకొచ్చింది పూజ. ఇక ఫోటోలో లంగా ఓణీ లో పూజ హెగ్డే పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement