Wednesday, March 27, 2024

50 డేస్ టూ గో ! పొన్నియన్ సెల్వన్-2 ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయరామ్, త్రిష, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియ‌న్ మూవీ పాన్నియిన్ సెల్వన్. ఈ సినిమా రెండో పార్ట్ ఏప్రిల్ 28 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉంది. రిలీజ్ కి ఇంకా 50 రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను షురూ చేయడం చేశారు.

ఈ మూవీకి ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండ‌గా.. పొన్నియ‌న్ సెల్వ‌న్-2 పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మద్రాస్ టాకీస్ & లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ పొన్నియ‌న్ సెల్వ‌న్-1 సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement