Wednesday, March 27, 2024

2018మూవీ.. సోనీలివ్ లో స్ట్రీమింగ్

2018ఈ మూవీ ప‌లు రికార్డ్స్ ని సృష్టించింది. ఫ‌స్ట్ డే నే రూ.కోటి క‌లెక్ష‌న్స్ సాధించి త‌న స‌త్తా చాటింది ఈ చిత్రం. ఈ సినిమాను జూన్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా సోనీలివ్ ప్రకటించింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టోవినో థామస్ .. కుంచాకో బోబన్ .. అపర్ణ బాలమురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా అక్కడ విడుదలైంది. కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. అలాంటి ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన తెలుగులో విడుదల చేశారు. పెద్దగా పబ్లిసిటీ .. ప్రమోషన్స్ లేకపోయినా, ఈ సినిమా నాలుగు రోజుల్లో 4 కోట్లను వసూలు చేసింది. కంటెంట్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించారేమో అనుకునేలా ఉండే ఈ సినిమాను, చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement