Thursday, April 25, 2024

20ఏళ్ల విరామం తర్వాత బిగ్ స్ర్కీన్ పై ‘షాలిని’

20ఏళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్ పై మెరవనుంది నటి..తమిళ స్టార్ హీరో అజిత్ సతీమణి షాలిని. చివ‌రిసారిగా పిరియ‌ధ వ‌ర‌మ్ వెండ‌మ్ (2001)తర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూర‌మైంది. ఈ భామ మ‌ళ్లీ 20 ఏళ్ల విరామం త‌ర్వాత బిగ్ స్క్రీన్‌పై సంద‌డి చేసేందుకు రెడీ అవుతుంది. ‌షాలిని రీఎంట్రీ వార్త‌తో అజిత్-షాలిని అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలో షాలిని కీ రోల్ చేస్తున్న‌ట్టు వార్త‌లు ఇపుడు కోలీవుడ్ నాట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. విక్ర‌మ్‌-జ‌యం ర‌వి స్టార్ కాంబోలో వ‌స్తున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని రామోజీఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అంతేకాదు షాలిని ఫిబ్ర‌వ‌రి చివ‌రి క‌ల్లా హైద‌రాబాద్‌లో ల్యాండై..షూటింగ్ లో పాల్గొననున్న‌ట్టు టాక్‌. షాలిని రీఎంట్రీకి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌నుంద‌ట. 

Advertisement

తాజా వార్తలు

Advertisement