Friday, April 19, 2024

‘శ్యామ్ సింగ రాయ్’ కు 2కోట్లు నష్టమా ?

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని చేసిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది. అలాగే శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా శ్యామ్ సింగ రాయ్ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల కోల్ కత్తా ను తలపించే ఓ భారీ సెట్ ను వేశారు. ఆరున్నర కోట్ల రూపాయలతో పది ఎకరాల్లో దీనిని నిర్మించారు. ఇక ఈ సెట్ లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.అయితే కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ సెట్ అంతా నాశనం అయిందని.. ఈ సెట్ ను మళ్ళీ పునః నిర్మించడానికి మరో రెండు కోట్ల రూపాయల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే నిర్మాతలకు నష్టం అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయిన్పల్లి నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement