Wednesday, April 24, 2024

సుకుమార్ కి ‘చిరంజీవి’ గిఫ్ట్..

దర్శకుడు సుకుమార్ కి మెగాస్టార్ చిరంజీవి గిఫ్ట్ పంపారట. హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఫస్ట్ మూవీ ఉప్పెన హిట్ అవ్వడం చిరంజీవికి సంతోషాన్ని కలిగించింది. దాంతో ఆయన ఆ చిత్రం కీలక సభ్యులకు గిఫ్ట్స్ ని..అభినందన లేఖలని పంపిస్తున్నారు.  స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ లాడ్రో విక్రయిస్తోన్న ది థ్రిల్ ఆఫ్ లవ్ కపుల్ ఫిగరైన బొమ్మలను పంపిచంరాు. సముద్రం ఒడ్డున మోకాళ్లపై కూర్చుని కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటున్నట్లున్న యువ జంట బొమ్మ ఖరీదు రూ.89వేలట. దర్శకుడు సుకుమార్ కు కూడా చిరంజీవి ఈ బహుమతిని పంపారు. దాంతో తన ఆనందాన్ని సుకుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కొణిదెల చిరంజీవి..మద్రాసు ఇండియా..ఈ అడ్రస్ కు చిన్నప్పుడు అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి కలుగుతోందని సుకుమార్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement