Monday, April 15, 2024

వెండితెర సత్యభామ జమున ఇక లేరు..

సీనియర్ నటి జమున (86) నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు.

ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యారు..

నాటకాల నుంచి సినిమా రంగంలోకి..

- Advertisement -

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జ‌మున‌.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, జగ్గయ్య సహా పలువురు దిగ్గజ నటులతో నటించారు. 11 గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించున్న‌ట్టు తెలుస్తోంది.

జమున 1936 ఆగస్టు 30న కర్నాటక రాష్ట్రం హంపీలో జన్మించారు. ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. కాగా, ఆమె తొలి చిత్రం పుట్టిల్లు. సత్యభామ పాత్రతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు. అయితే సినీనటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడం వల్ల జమున కుటుంబానికి కొంత పరిచయం ఉండేది.

ఆ సమయంలోనే నాటకాలకు ఆకర్షితురాలైన జమున చూసి తన నాటకాలలో అవకాశం ఇచ్చారు జగ్గయ్య. అలా ఆమె తొలిసారి ఖిల్జీ రాజ్య పతనం, మా భూమి వంటి నాటకాలలో ప్రదర్శన చేశారు. అలా ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement