Thursday, April 18, 2024

వరుణ్ తో మరోసారి సాయి పల్లవి ?

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయిపల్లవి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు నటన పరంగా ఆమె మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా వెంకీ కుడుముల ఛలో, భీష్మ నా సినిమాలతో హిట్ కొట్టి టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అయితే ఇటీవల వెంకీ వరుణ్ కు ఓ కథ చెప్పాడట. వరుణ్ కి కూడా ఆ కధ ఎంతో నచ్చిందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతోందట. ఇప్పటికే సాయి పల్లవిని కలిసి వెంకీ కుడుముల కథ చెప్పారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ గని సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement