Thursday, April 25, 2024

రాజమండ్రిలో ‘చిరంజీవి’కి ఘనస్వాగతం

ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి  ఈ రోజు ఫిబ్రవరి 21న రాజ‌మండ్రికు వెళ్ల‌గా అక్కడ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఎయిర్ పోర్టు నుంచి గోకవరం వరకు చిరంజీవి ర్యాలీ సాగగా, అభిమానులు పూల వ‌ర్షం కురిపించారు. ప్ర‌స్తుతం ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే  మెగాఫ్యామిలీ సినిమాలకు మారేడుమిల్లి షూటింగ్ స్పాట్ గా మారిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గతనెలలో అల్లు అర్జున్ పుష్ప అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌గా, ఇప్పుడు ఆచార్య కోసం చిరు, రామ్ చ‌ర‌ణ్ మారేడుమిల్లి ప్రాంతానికి రావ‌డం ప‌ట్ల గిరిజ‌నులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ఆచార్య‌. ఇందులో మెగాస్టార్ న‌క్స‌లైట్‌గా క‌నిపించ‌నున్నార‌ని టాక్. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.కాగా  రామ్ చ‌ర‌ణ్ సిద్ధ అనే పాత్ర‌లో విద్యార్ధి నాయ‌కుడి పాత్ర‌లో మెర‌వ‌నున్నాడు. మే 13న విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్పటివరకు హైదరాబాద్ శివారులో వేసిన టెంపుల్ సెట్లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌గా, ఇప్పుడు మారేడుమిల్లి ఏజెన్సీతో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement