Saturday, April 20, 2024

మార్చి 5న’ ఏ1 ఎక్స్ ప్రెస్’

మార్చి 5న ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హాకీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రం ఇదే. డెన్నిస్ జీవన్ రూపొందించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్..లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, రెండు పాటలకు అద్భుతమైన స్పందన దక్కింది. ఇక, ట్రైలర్ య్యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కించుకుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న విడుదల కాబోతోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఒక వారం ఆలస్యమైంది. ఈ సినిమాకు సందీప్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement