Thursday, April 25, 2024

మరోసారి ‘పవన్’ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా

గత కొన్నేళ్లుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్‌గా విధులు నిర్వర్తిస్తూ సినిమాలకు దూరమయ్యారు. ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాతోనే పునరాగమనం చేయబోతున్నారు. పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సినిమాకు ఆనంద్ సాయి కళా దర్శకునిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement