Thursday, April 25, 2024

‘భీష్మ’కి ఏడాది

యంగ్ హీరో నితిన్..హీరోయిన్ రష్మిక మందన కలిసి నటించిన చిత్రం భీష్మ. దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ అయి నేటితో ఫిబ్రవరి 21కి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా ద్వారా ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుంది. `భీష్మ విడుదలై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. నాకేనా అందరికీ అలాగే జరుగుతోందా వెంకీ.. నీతోనూ, ఫిబ్రవరితోనూ మంచి అనుబంధం ఉంది. ఫిబ్రవరిని నాకు చాలా స్పెషల్‌గా మార్చినందుకు నితిన్‌కు, వెంకీకి ధన్యవాదలని రష్మిక పేర్కొంది. రష్మిక తొలి తెలుగు సినిమా ఛలో కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదలైంది. ఈ సినిమాకు కూడా వెంకీ కుడుములే దర్శకుడు కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement