Wednesday, April 24, 2024

భారీ రేటుకు ‘ఆచార్య’ శాటిలైట్ రైట్స్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. తొలుత ఈ చిత్ర నిర్మాతలు శాటిలైట్ హక్కులను రూ.80 కోట్లకు విక్రయించాలని భావించారు. కానీ ఏ సంస్థ ముందుకు రాలేదు. దీంతో మేకర్స్ రూ.50 కోట్లకు తగ్గించగా జీ సంస్థ, సన్ టీవీ సంస్థలు పోటీ పడ్డాయి. ఈ రెండింటిలో ఒక సంస్థ ‘ఆచార్య’ శాటిలైట్ రైట్స్ తీసుకునేలా నిర్మాతలతో చర్చలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 13న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్, పూజాహెగ్డే అతిథి పాత్రల్లో మెరవనున్నారు. త్వరలోనే రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement