Thursday, April 25, 2024

భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటుదాం..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు హీరోయిన్ అర్చన.  భవిష్యత్తు తరాల కోసం మనమందరం మొక్కలు నాటాలని అర్చన శాస్త్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడాన్ని బాధ్యతగా స్వీకరించాలన్నారు.  ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా యాంకర్‌ దీప్తి వాజ్‌పేయి విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించి  జూబ్లీహిల్స్‌లోని పార్కులో అర్చన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మధుమిత, శివబాలాజీ,నేహసుమన్‌ షా, అశీమ, ప్రాచీలు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని అర్చన శాస్త్రి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement