Saturday, April 20, 2024

బాలయ్యకు హీరోయిన్‌గా నో…గెస్ట్ రోల్ ఓకే..!!

నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. కాగా అఖండ లో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ నటిస్తున్నారు. కానీ గోపిచంద్ సినిమాకు ఓ సమస్య వచ్చిపడిందట. అదే బాలయ్య సీనియారిటీ. బాలయ్య తో సినిమా చేసేందుకు యంగ్ స్టార్ హీరోయిన్ ఎవరు కూడా అంగీకరించడం లేదట.

డైరెక్ట్ గా ఆ విషయాన్ని చెప్పకుండా దర్శకులను నొప్పించకుండా సున్నితమైన కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారట. అయితే గోపీచంద్ మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హసన్ ను సంప్రదించగా శృతిహాసన్ డేట్స్ సెట్ కావడం లేదని చెప్పిందట. దీనితో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ గోపీచంద్ కు శృతిహాసన్ లక్కీ హీరోయిన్ కావడంతో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయాలని కోరాడట. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement