Thursday, March 28, 2024

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాపై మరో అప్డేట్!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితా బచ్చన్ దీపికా పదుకొనే కూడా నటిస్తున్నారు. దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని సూట్ కి రెడీగా ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుత కాలానికి లేదా పాత కాలానికి సంబంధించిన డ్రామాలా ఉండదట. భవిష్యత్తులో ఉండే హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉంటుందట. 2050 వ సంవత్సరం దాటిన తరువాత ఎటువంటి సెటప్ వస్తాయో అలాంటి సెటప్ లో కనిపించబోతుందట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు రావట్లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement