Tuesday, April 23, 2024

నిర్మాతగా మారిన హీరోయిన్

హీరోయిన్ అవికాగోర్ నిర్మాతగా మారింది. అవికా స్ర్కీన్‌ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఆమె కథానాయికగా నటిస్తూ, ఆచార్య క్రియేషన్స్‌తో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నారు. సాయి రోనక్‌ కథానాయకుడు. మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకుడు. భోగేంద్ర గుప్తా మడుపల్లి నిర్మాత. అవికాగోర్‌ మాట్లాడుతూ ‘చిన్నతనం నుంచి నటనారంగంలో ఉన్నా. ఆ ధైర్యంతోనే నిర్మాతగా మారాను’’ అని అన్నారు. ‘‘మెలో డ్రామా జానర్‌లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒకరంటే ఒకరికి గిట్టని ఓ అమ్మాయి, అబ్బాయి… తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైందనేది కథ’ అని దర్శకుడు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement