Tuesday, April 16, 2024

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా..’కృతిశెట్టి’

హీరోయిన్ కృతిశెట్టి డాక్టర్ అవ్వాలని కలలు కన్నానని తెలిపింది. అనుకోకుండా యాక్టర్ ని అయ్యానని చెప్పింది. ఉప్పెన చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్..సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యెర్నేని. వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ నెల 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. నటనపై ఆసక్తి ఉన్నా సినిమాల్ని కెరీర్‌గా ఎంచుకోవాలని ఏ రోజు అనుకోలేదు. చదువును కొనసాగిస్తూనే  కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించా. వాటి ద్వారా ‘ఉప్పెన’ సినిమాలో అవకాశమొచ్చిందని కృతి చెప్పింది. బుచ్చిబాబు చెప్పిన కథ వినగానే కన్నీళ్లొచ్చాయి. చాలా కాలం తర్వాత వెండితెరపై రానున్న స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. 2002 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఇందులో బేబమ్మ అనే పాత్ర చేశా. పాత్రలో సహజత్వం కనబరచడానికి ఎంతో శ్రమించా. దర్శకుడు సృష్టించిన క్యారెక్టర్‌ అనే భావనతో కాకుండా రియల్‌గా నాకు అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ నటించానని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement