Friday, April 19, 2024

టెన్ కాశీలో ‘పుష్పరాజ్’

టెన్ కాశీలో పుష్పరాజ్ సందడి చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ తమిళనాడులో సందడి చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం టెన్‌కాశీలో జరుగుతోంది. ఇటీవల మారేడుమిల్లిలో ఓ పాట, పలు సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం టెన్‌కాశీ చేరుకుంది. అక్కడ హీరోహీరోయిన్లపై సాగే సన్నివేశాలతోపాటు సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఓ పాటను కూడా తెరకెక్కించనున్నారని సమాచారం. మైతీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 13న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement