Tuesday, March 26, 2024

‘ఉప్పెన’ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా అటు హీరో హీరోయిన్లకు, దర్శకుడికి మొదటి సినిమా కావడం విశేషం.

సుకుమార్ శిష్యుడుగా బుచ్చిబాబు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇదిలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతంఅందించారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement