Friday, April 26, 2024

అర్థ శతాబ్దం నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

రవీంద్ర ఫుల్లే దర్శకత్వంలో కార్తీక్ రత్నం ,కృష్ణప్రియ జంటగా తెరకెక్కుతున్న చిత్రం అర్థ శతాబ్దం. రిషిత శ్రీ క్రియేషన్స్ 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ బ్యానర్లపై ఈ సినిమాను చిట్టి కిరణ్ ,రాధాకృష్ణ, రామోజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే నవీన్ చంద్ర ,సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కు సంబంధించి మెరిసే లే అనే లిరికల్ సాంగ్ ను యూనిట్ విడుదల చేశారు.

ఈ సాంగ్ చూస్తుంటే హీరో హీరోయిన్లు పెళ్లి నేపథ్యంలో సాగే సాంగ్ లా అనిపిస్తోంది. కాగా శంకర్ మహదేవన్ ఈ సాంగ్ ను ఆలపించగా.. రెహమాన్ లిరిక్స్ అందించారు. నౌ పాల్ రాజా సంగీతం అందించిన ఈ సాంగ్ కన్నా ముందు ఏ కన్నులు చూడని సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement