Saturday, April 20, 2024

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

స్మార్ట్​ ఫోన్​ అవసరం లేకుండా ఒకేసారి నాలుగు డివైజ్​లకు అకౌంట్ లాగిన్​ అయ్యి వాడుకునేలా వాట్సాప్‌లో కొత్త ఫీచర్​ త్వరలో రాబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో​ విల్​ క్యాథ్​కార్ట్​​ ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాట్సాప్​ను ఒకేసారి నాలుగు డివైజ్​లలో లాగిన్​ అయ్యేలా ఫీచర్​ తేబోతున్నాం. ఈ సౌకర్యంతో ఐప్యాడ్​లో వాట్సాప్ లాగిన్​ అయ్యేందుకు వీలు ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్​ వెబ్​, డెస్క్​టాప్​ యాప్​ కోసం స్మార్ట్ ఫోన్​తో స్కానింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మీదట మెయిన్​ యాప్​, స్మార్ట్​ ఫోన్ యాప్​​ సపోర్ట్ లేకుండా మల్టీ డివైజ్​ ఫీచర్​(లింక్​)తో లాగిన్​ కావొచ్చు అని ఆయన వివరించారు.

కాగా ఈ విషయాన్ని మార్క్​ జుకర్​బర్గ్​ కూడా ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రైవసీ సమస్యలు ఉన్నా దీన్ని ఓ టెక్నికల్ ఛాలెంజ్​గా తీసుకున్నాం. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించాం. ఫోన్​ స్విచ్ఛాప్ అయినా కూడా మల్టీ డివైజ్ లాగిన్​ ద్వారా వాట్సాప్​ పని చేసేలా ఫీచర్​ పరిశీలనలో ఉంది’ అని జుకర్​బర్గ్ తెలిపారు. అలాగే ‘వ్యూ వన్స్​’.. అవతలి యూజర్​ ఒకసారి ఫొటో, వీడియో చూడగానే దానంతట అదే మాయమయ్యే ఫీచర్​ కూడా ఫ్యూచర్ అప్​డేట్ పరిశీలనలో ఉందని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement